Narendra Bunde, ‘cricket astrologer’ by profession said, All my past predictions had been correct. I can see Virat winning the T20 and ODI World Cup by 2025 and also break Sachin’s record,” Bunde said. <br /> <br />2025కల్లా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డులన్నీ కనుమరుగవుతాయి. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? నాగపూర్కు చెందిన క్రికెట్ జ్యోతిష్కుడు నరేంద్ర బుండే. అయితే సచిన్ రికార్డులను బద్దలు కొట్టేది మరెవరో కాదు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే అంట. ఈ విషయాన్ని డీఎన్ఏఇండియా.కామ్ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో నరేంద్ర వెల్లడించాడు. "గతంలో నేను చెప్పిన అంచాలన్నీ నిజమయ్యాయి. 2025కల్లా విరాట్ కోహ్లీ టీ20, వన్డే వరల్డ్ కప్లను గెలుస్తాడు. అలాగే సచిన్ 100 సెంచరీల రికార్డు ను బద్దలు కొడతాడు" అని వెల్లడించాడు. <br />అదే విధంగా 2018లో విరాట్ కోహ్లీ అతి పెద్ద ఎండార్సెమెంట్ ఒప్పందం కుదుర్చుకుంటాడని తెలిపాడు. ఈ ఒప్పందాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను మల్టీ మిలియనీర్ను చేసిన మార్క్ మస్కరెన్హాస్ ఒప్పందంతో పోల్చాడు. విదేశాల్లో కూడా కోహ్లీ సారథ్యంలోని టీమిండియా అద్భుత విజయాలను నమోదు చేస్తుందని చెప్పాడు. <br />"విరాట్ కోహ్లీ గ్రహస్థితి చాలా బలంగా ఉన్నాడని ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీ విదేశాల్లో కూడా రాణిస్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుంది" అని చెప్పాడు. గతంలో కూడా ఈ క్రికెట్ జ్యోతిష్కుడు చెప్పిన అంచనాలు నిజం కావడంతో వార్తల్లో నిలిచాడు. <br />అంతకముందు సచిన్ టెండూల్కర్ టెన్నిస్-ఎల్బో సమస్యతో బాధపడతాడని, అతడికి భారతరత్న అవార్డు కూడా వస్తుందని ముందే చెప్పాడు. దీంతో పాటు సౌరవ్ గంగూలీని జట్టు నుంచి గ్రెగ్ ఛాపెల్ తప్పించినప్పటికీ అతడు తిరిగి జట్టులో చోటు దక్కించుకుంటాడని చెప్పాడు.
